షష్ట్యంతాలు
హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.
శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
పాలికి, వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.
క్షంతకుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.
షష్ట్యంతాలు అంటే కావ్యాన్ని అంకితం ఇచ్చే సందర్భంలొ వ్రాసిన పద్యాలు. ఇక్కడ పోతన కావ్యాన్ని రాముని ఆజ్జతో రాసి
శ్రీహరికి అంకితం ఇచ్చాడు. ఆపద్యాలన్ని ఒక శిల్పి శిల్పాల్ని చెక్కినట్టు చెక్కాడు పోతన్న.
మొదటగా నాలుపద్యాల్ని ధర్మానికుండె నాలుగు పాదాలైన సత్యము, శీలము, దయ, న్యాయము గా విభజించేడు.
అవి ఒక్కొక్కటి ఒక్కొపద్యానికి వర్తింపజేస్తూ ధర్మాన్ని నాలుగుపాదాల నడిపించమని ఆ శ్రీహరిని వేడుకున్నాడు.
అంత్యప్రాసలతొ అత్యంత సుందరంగా వర్ణించేడు. మనకి ఒక సందేహం రావచ్చు. మొదటి పద్యంలొ సత్యం గురించి
చెప్పలేదుకదా. నాలాంటి మందబుద్ధులు ఉంటారిని పోతనకి బాగాతెలుసు. అందుకోసమే ముందుగానే చెతు లారంగ
అనే పద్యాన్ని రాసేడు.
అందులో క్రమాలంకారాన్ని అన్వయంచెస్తే దయను శివుని గాను సత్యాన్ని హరి గాను తెలుసుకొవచ్చు.
ఆ నాలుగు పద్యాల్లోనె కృష్ణ లీలన్ని వర్ణించేడు. గొకులం నుంచి కృష్ణావతార సమాప్తి వరకు చెప్తూ కృష్ణ మూలము
అన్న పదాన్ని సార్ధకం చేసేడు.
మొదటి పద్యం లొ హారి అన్న పదం ప్రతి పాదానికి రెండు సార్లు వస్తుంది. హరికి, లక్ష్మీదెవికి స్వాగతం చెపుతూ అడుగడుగునా
(పాదం అంటె అడుగేకదా) అక్షర మాలలతొ స్వాగతం పలికేడు. దాంతో పాటుగా ఆ పద్యం చదువుతుంటె ఆశభ్దం లొ కొన్ని
మనకి స్పురిస్తాయి. నందగొకులము అనేటప్పుడు నందకం అన్నది, చక్రదైత్య అనేటప్పుడు. చక్రము. గొపనితంబినీ
అన్నప్పుడు గద, ఘోష కుటీప అన్నప్పుడు శంఖం, సంపద అన్నప్పుడు లక్ష్మీ దెవి, ఇలా అర్ధంలొ కాకుండా శభ్ద చిత్రణ
ద్వారా విష్ణుమూర్తిని సాలంకృతం గా మనముందు ఆవిష్కరిస్తాడు,.
పోతన తెలుగు వాడవటం మనందరి అదృష్టం. పలికిన భవహరమగునట అనే తనేచెప్పేడు. భాగవతం చదువుదాం
చదివిద్దాం.
కాముధ – కాకర మురళీధర్.
Leave a comment